లక్డీకాపూల్​లో కొత్త పైప్​లైన్ నిర్మాణంతో వరద ముంపు ఉండదు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​

లక్డీకాపూల్​లో కొత్త పైప్​లైన్  నిర్మాణంతో వరద ముంపు ఉండదు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​
  • త్వరలోనే పనులు స్టార్ట్ చేస్తం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త పైప్​లైన్ ఏర్పాటుతో లక్డీకాపూల్ లో వరద సమస్య చెక్​పడుతుందని హైడ్రా కమిషనర్​ఏవీ రంగనాథ్​ తెలిపారు. శుక్రవారం ఆయన ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ అడిషనల్​కమిషనర్ విశ్వప్రసాద్,  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, వాటర్​బోర్డు అధికారులతో కలిసి లక్డీకాపూల్​ఏరియాను పరిశీలించారు. టెలిఫోన్ భ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌ రూట్​లోని ద్వార‌‌‌‌‌‌‌‌కా హోట‌‌‌‌‌‌‌‌ల్ నుంచి మెహిదీప‌‌‌‌‌‌‌‌ట్నం రూట్​లోని ల‌‌‌‌‌‌‌‌క్కీ రెస్టారెంట్ వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెక్ మెషీన్‌‌‌‌‌‌‌‌తో మ్యాన్‌‌‌‌‌‌‌‌ హోళ్లను ప‌‌‌‌‌‌‌‌రిశీలించారు. స్ట్రాం వాటర్ పైపులైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించినా సమస్య పరిష్కారం కాలేదు. 

దశాబ్దాల కింద నిర్మించినవి కావడంతో లక్డీకాపూల్​మెట్రో పిల్లర్ నంబర్ 1211 వద్ద బ్లాక్ స్ట్రాం వాటర్ పైపులైన్ పూర్తిగా బ్లాక్ అయిందని, లక్డీకాపూల్ నుంచి మెహిదీప‌‌‌‌‌‌‌‌ట్నం వైపు వెళ్లే వంతెన ముందు భాగంలో పైపులైన్ శిథిల‌‌‌‌‌‌‌‌మైందని గుర్తించారు. వాటి స్థానంలో కొత్త పైప్​లైన్లు నిర్మించాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడి కొత్త లైన్ల ఏర్పాటుపై రంగనాథ్ చర్చించారు. .

వారం రోజుల్లో ప‌‌‌‌‌‌‌‌నులు ప్రారంభించాలని, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది లేకుండా ఒక‌‌‌‌‌‌‌‌టి రెండు రోజుల్లో ప‌‌‌‌‌‌‌‌నులు పూర్తిచేయాలని నిర్ణయించారు. వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ద ముప్పు తీవ్రంగా ఉన్న 30 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌‌‌‌‌‌‌‌రిశీలన చేసి, స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్య త‌‌‌‌‌‌‌‌లెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. లక్డీకాపూల్​చౌర‌‌‌‌‌‌‌‌స్తాలో 20 ఏండ్లుగా ఇదే స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్య ఉంద‌‌‌‌‌‌‌‌ని  స్థానికులు, దుకాణ‌‌‌‌‌‌‌‌దారులు రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు.