HYDRA : నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయం..కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తాం

HYDRA :  నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయం..కొత్త నిర్మాణాలను  మాత్రమే కూలుస్తాం

 గ్రేటర్ పరిధిలో అక్రమ కూల్చివేతలపై హైడ్రా  మరో  కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టీఎల్,బఫర్ జోన్లో  ఇప్పటికే  నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని.. కొత్తగా నిర్మించే ఇళ్లను మాత్రమే కూలుస్తామని  ప్రకటించారు  హైడ్రా కమిషనర్ రంగనాథ్.

మల్లంపేట చెరువు, సున్నం చెరువు పరిధిలో ఎఫ్ టీఎల్ లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు..వాటిని కూల్చేశాం..మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చేశాం. బిల్లర్  విజయలక్ష్మిపై  క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. విజయలక్ష్మికి పలువురు రాజకీయ నేతలతో సంభంధాలున్నాయని చెప్పారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో కొత్తగా ఇళ్లు, స్థలాలు కొనుగోలుచేయొద్దని సూచించారు.

ALSO READ | మాదాపూర్, మల్లంపేట్‌లో విల్లాలు, షెడ్లు మటాష్ : హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు