
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ పరిధిలోని చెరువుల అభివృద్ధికి కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని హైడ్రా కమిషనర్రంగనాథ్పిలుపునిచ్చారు. సీఎస్ఆర్కింద నిధులు ఇవ్వాలని కోరారు. సీఎస్ఆర్ఫండ్స్ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.
మాదాపూర్ సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, అంబర్పేట బతుకమ్మకుంట, పాతబస్తీ బమృక్నుద్దీన్ దౌలా చెరువులను అభివృద్ధి చేస్తున్నామని రంగనాథ్తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో 1,025 చెరువులు ఉండగా 61 శాతం జాడలేవని, ఉన్న 39 శాతం చెరువులను పరిరక్షిస్తున్నామన్నారు.