హైడ్రా కూల్చివేతలు..8 ఎకరాలు స్వాధీనం

హైడ్రా కూల్చివేతలు..8 ఎకరాలు స్వాధీనం

చెరువుల ఆక్రమణలపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇవాళ మూడు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను నేలమట్టం చేసింది. కూకట్ పల్లి నల్లచెరువులో 16 కమర్షియల్ షెడ్లను కూల్చివేసి నాలుగు ఎకరాలు స్వాధీనంచేసుకుంది. 

ALSO READ | అయ్యా.. వ్యాపారం చేసుకుంటున్నాం.. కూల్చొద్దంటూ కన్నీళ్లతో మహిళల ఆవేదన

అమీన్ పూర్ కిష్టారెడ్డిపేటలో మూడు భవనాలు కూల్చివేసి ఎకరం స్థలం స్వాధీనం చేసుకున్నారు.పటేల్ గూడలో 25 విల్లాలను కూల్చిన హైడ్రా మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ మూడు ప్రాంతాల్లో కూల్చివేతలతో 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా.