
- 357 మందికి డీఆర్ఎఫ్ శిక్షణ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా మీద నమ్మకంతో ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగిస్తోందని హైడ్రా చీఫ్రంగనాథ్తెలిపారు. ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యతను అప్పగించిందని చెప్పారు. -పోలీస్ఉద్యోగాల కోసం ప్రయత్నించి అతి తక్కువ మార్కులతో జాబ్ కోల్పోయిన 357 మందిని డీఆర్ఎఫ్(ఔట్ సోర్సింగ్)లోకి తీసుకున్న హైడ్రా వారికి అంబర్ పేట పోలీస్గ్రౌండ్ లో శిక్షణ ప్రారంభించింది.
గురువారం శిక్షణా కార్యక్రమాన్ని రంగనాథ్ప్రారంభించి మాట్లాడారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకమైనదని, అప్పగించిన బాధ్యతలను నూటికి నూరు శాతం నెరవేర్చాలన్నారు. హైడ్రా ఔట్సోర్సింగ్జాబుల్లో చేరిన వారిలో మేనేజర్లతోపాటు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. మేనేజర్లకు నెలకి రూ.22,500, అసిస్టెంట్లకు నెలకి రూ.19,500 జీతం అందజేయనున్నది.