
న్యూఢిల్లీ: హైపర్ లూప్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ తొలి టెస్ట్ ట్రాక్ను 422 మీటర్ల మేర ట్రాక్ను సిద్ధం చేసిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ట్వీట్చేశారు. భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ కొత్త ఆవిష్కరణలకు ఆర్థికంగా సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం టెస్ట్ ట్రాక్ మాత్రమే సిద్ధమైందని, ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు.
ప్రాజెక్టులో తదుపరి దశ ప్రయోగాల కోసం ఐఐటీ మద్రాస్కు మరో 9 కోట్లు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే తొలి కమర్షియల్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. కాగా, ఈ ప్రాజెక్ట్ పూర్తయి హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే 350 కిలోమీటర్ల దూరం జస్ట్ 30 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రి తెలిపారు.