
- యువతలో పెరుగుతున్న బీపీ, షుగర్లు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదీ..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీపీ, షుగర్ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది. వీటితో జిల్లా వ్యాప్తంగా 1,32,060 మంది బాధపడుతున్నట్లు తేలింది. ప్రధానంగా యువత బీపీ, షుగర్వ్యాధుల బారిన ఎక్కువగా పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో ఎన్సీడీ(అసంక్రమిత వ్యాధుల నివారణ ప్రోగ్రాం)లో భాగంగా స్పెషల్ సర్వే నిర్వహించారు. జిల్లాలో 6,23,444మందికి గానూ 4,88,821 మందికి బీపీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఇందులో 87,754 మంది బీపీతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. 38,850 మంది గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు వాడుతున్నారు. 5,12,321 మందికి షుగర్కు సంబంధించి స్క్రీనింగ్ చేశారు. 44,306 మంది షుగర్తో బాధపడుతున్నట్టు గుర్తించారు. 20,160 మంది గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు
వాడుతున్నారు.
35 ఏండ్లలోపు వారే ఎక్కువ...
సర్వేలో 35 ఏండ్ల లోపు వారే ఎక్కువగా బీపీ, షుగర్ బారిన పడుతున్నట్టుగా వైద్య సిబ్బంది గుర్తించారు. బీపీ, షుగర్తో 1,32,060 మంది బాధపడుతుండగా ఇందులో దాదాపు సగం మంది రెండింటితో ఇబ్బందిపడుతున్నారు. కాగా, గవర్నమెంట్ హాస్పిటళ్లలో బీపీ, షుగర్కు కావాల్సిన మందులు సరిగా అందుబాటులో ఉండడం లేదని, పేషెంట్లను సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మందులు అందుబాటులో ఉన్నాయి
బీపీ, షుగర్లకు సంబంధించిన మందులు అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో పాటు టెన్షన్లను తగ్గించుకోవడంతో చాలా వరకు బీపీ, షుగర్లను తగ్గించుకోవచ్చు.
ఎల్.భాస్కర్ నాయక్, డీఎంహెచ్ఓ, భద్రాద్రికొత్తగూడెం