మధ్యప్రదేశ్‌లో కూలిన ఐఏఎఫ్‌ యుద్ధ విమానం..ఇద్దరు పైలట్లకు గాయాలు

మధ్యప్రదేశ్‌లో కూలిన ఐఏఎఫ్‌ యుద్ధ విమానం..ఇద్దరు పైలట్లకు గాయాలు

మధ్యప్రదేశ్‌లో ఐఏఎఫ్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం(ఫిబ్రవరి 6) ని శివపురి సమీపంలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా రెండు సీట్ల మిరాజ్ 2000 యుద్ధ విమానం కుప్పకూలింది.  

అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశిస్తున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు. 

ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించిన ఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ మిరాజ్ 2000 1978లో మొదటిసారిగా ఎగిరింది. 1984 లో ఫ్రెంచ్ వైమానిక దళం దీనిని ప్రవేశపెట్టింది. 600 మిరాజ్ 2000 లను ఉత్పత్తి చేశారు. వీటిలో 50 శాతం భారతదేశంతో సహా ఎనిమిది దేశాలకు ఎగుమతి చేశారు.