టీఎస్పీఎస్సీ చైర్మన్గా బి. జనార్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వ్వవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనార్ధన్ రెడ్డి గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా కూడా పనిచేశారు. జనార్ధన్ రెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యుల కమిటిని కూడా నియమించారు. సభ్యులుగా టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ఆయుర్వేద డాక్డర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ హెల్త్ ఈఎన్సీ రమావత్ ధన్సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట అరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సుమిత్రా ఆనంద్లను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు సంబంధించిన లేఖను సీఎంవో విడుదల చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బుధవారం నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు కొత్తగా ఎన్నికైన సభ్యులను గవర్నర్ ఆమోదించారు. చైర్మన్గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్), సభ్యులుగా రమావత్ ధన్ సింగ్ (బీటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ, హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ, ఎంఏ ఎల్ఎల్బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్), సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఏ తెలుగు, తెలుగు పండిట్ ), కారం రవీందర్ రెడ్డి (బీకాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బీఎఎమ్ఎస్, ఉస్మానియా, ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), ఆర్. సత్యనారాయణ (బీఏ, జర్నలిస్ట్) లను సీఎం కేసీఆర్ నియమించారు.