హైదరాబాద్, వెలుగు : సీఎం ప్రిన్సిపల్ సెక్ర టరీగా శేషాద్రిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా అదనపు డైరెక్టర్ జనరల్శివధర్ రెడ్డిని నియమించారు.
కేసీఆర్ ప్రభుత్వంలోనూ శేషాద్రి కొంత కాలం సీఎం సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) సెక్రటరీగా ఉన్నారు. శేషాద్రికి అనుభవంతో పాటు నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా పేరుంది.