
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నంలో కొత్తగా 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జికోర్టును హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో భాగంగా అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్జడ్జి శశిధర్ రెడ్డి నేరుగా హాజరై కోర్టు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కోర్టు జడ్జిలు జయ ప్రసాద్, శ్రీదేవి, రీటా లాల్, యశ్వంత్ సింగ్, హిమబిందు, ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజన్ రెడ్డి, కార్యదర్శి మహేందర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.