IC 814: The Kandahar Hijack Review: ఐదుగురు హైజాకర్లు, 189 జీవితాలు, 7 రోజుల భయానకం

IC 814: The Kandahar Hijack Review: ఐదుగురు హైజాకర్లు, 189 జీవితాలు, 7 రోజుల భయానకం

విమానం హైజాక్ అనగానే.. వెంటనే గుర్తొచ్చేది 1999లో జరిగిన కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాగ్‌‌‌‌‌‌‌‌ ఇన్సిడెంట్.  దీని స్ఫూర్తితో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఇది జరిగి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఇప్పుడీ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ వస్తోంది. ‘ఐసి 814: ది కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాక్‌‌‌‌‌‌‌‌’ (IC 814, Kandahar Hijack) పేరుతో అనుభవ్ సిన్హా దీన్ని తెరకెక్కించారు. అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ సీరీస్ లో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. స్టార్ హీరో అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించగా..రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించారు.

తాజాగా ఈ సీరీస్ గురువారం (ఆగస్ట్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్కి వచ్చింది .ఐదుగురు హైజాకర్లు, 188 జీవితాలు, 7 రోజుల భయానకం యథార్థ ఘటనలతో ఈ సిరీస్ రూపొందించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ తో వచ్చింది. యదార్ధ సంఘటనలతో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఆడియన్స్ టాక్ 

హైజాక్ చేయబడిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అడ్డుపడే టాయిలెట్ పైపును కెప్టెన్ శరణ్ దేవ్ సరిచేస్తాడు. ఈ సీన్ కి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. నా కోసం చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, నేను నా విధిని మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. బాలీవుడ్ రెస్క్యూ డ్రామాలోని హీరో ఇంత నిర్మొహమాటంగా కెప్టెన్  ప్రవర్తించాడా? అంటూ సిరీస్ చూసిన వారు గొప్ప ఫీలింగ్ను తెలుపుతున్నారు.

అలాగే ఈ సిరీస్‌ను విజయపథంలో నడిపించడానికి కెప్టెన్ శరణ్ దేవ్ (విజయ్ వర్మ) కంటే..ఎవరూ ఎక్కువ యాక్ట్ చేయలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..విజయ్ వర్మ ఊహాత్మకంగా భావించి, కండలు కట్టి, హీరోయిజం అనే భావనను తిప్పికొట్టాడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నటించడం ద్వారా విజయ్ వర్మలోని వినూత్న నటన శైలి బయటపడింది అంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

కథ విషయానికి వస్తే:

1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ814 నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు ప్రయాణం ప్రారంభించింది. అందులో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. ముసుగులు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు విమానం హైజాక్ చేస్తారు. భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్ కాక్‌పిట్ వైపు వెళ్లాడు. విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించాడు.ఆ వెంటనే ముసుగులు ధరించిన మరో నలుగురు మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్నారు. విమానంలో తీవ్రమైన ప్రమాదం ఏర్పడటంతో..అందులో ఉన్న వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే వేగంగా క్షీణిస్తున్న ఇంధన ట్యాంక్‌తో అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మరియు చివరకు వెళ్లవలసి వస్తోంది. అపుడు కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే సమయంలో కెప్టెన్ శరణ్ దేవ్ (విజయ్ వర్మ) ఆదర్శప్రాయమైన ధైర్యం..అతని ప్రదర్శించే తెగువ ఆకట్టుకుంటోంది. 

అత్యంత ప్రతికూల పరిస్థితులలో సమస్య చల్లబడటానికి శిక్షణ పొందిన వ్యక్తికి ఇదంతా ఒక రోజు పని. కానీ దురదృష్టవశాత్తూ అతనికి మరియు ఆ విమానంలో బాధపడ్డ సిబ్బందికి, వారు పెట్టె చిత్రహింసలు మొత్తం వారం పాటు కొనసాగుతుంది. కెప్టెన్ దేవ్ పరిగణలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడటం ఆయన ప్రధానాంశంతో వచ్చిన ఈ సీరీస్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. 

మీడియా కథనాల ప్రకారం..

అక్కడ (అమృత్‌సర్‌లో) ఆ విమానం ల్యాండ్ అవ్వగానే హైజాకర్లపై చర్యలు తీసుకునేందుకు భద్రత దళాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ విషయాన్ని హైజాకర్లు గ్రహించారు. దీంతో ఇంధనం నింపుకోకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్‌ను బలవంతం చేశారు. మొదట ఆ విమానం దిగేందుకు పాకిస్తాన్ అనుమతి ఇవ్వలేదు. లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించింది. అయితే, ఇంధనం నింపుకునేందుకు ఆ విమానం లాహోర్ విమానాశ్రయంలో దిగడం తప్పనిసరి అయ్యింది. దీంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి వచ్చింది. ఇంధనం నింపుకున్న వెంటనే లాహోర్ విమానాశ్రయం నుంచి విమానం వెళ్లిపోవాలని పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత విమానం దుబాయి విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ హైజాకర్లు 27 మంది ప్రయాణికులను విడుదల చేశారు. మీడియా కథనాల ప్రకారం దుబాయి విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు చేపట్టేందుకు యూఏఈని భారత్ అనుమతి కోరింది. అయితే, యూఏఈ అందుకు అనుమతి ఇవ్వలేదు. అనంతరం విమానం అఫ్గానిస్తాన్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన కాందహార్‌కు చేరుకుంది. హైజాక్ ఉదంతం ముగిసేవరకూ అక్కడే ఉంది.

ALSO READ | G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘G2' మూవీ..ఫస్ట్ పార్ట్ కంటే ఏకంగా16 రెట్లు అధికం!

"డిసెంబర్ 24, 1999లో జరిగిన ఆ భయానక హైజాక్ ఘటన మన చరిత్రలోనే చీకటి రోజుగా నిలిచిపోయినట్లుగా..ఇది కేవలం ఒక్క విమానం హైజాక్ కాదు..మొత్తం దేశం హైజాక్ అంటూ" ఇంటెన్స్ పెంచేసింది.ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రాణాలను కాపాడటం ఒకెత్తయితే..హైజాకర్లను డిమాండ్లను నెరవేర్చడం మరో సవాలని' చెప్పటం ఆలోచింపజేస్తుంది. తమ పోరాటం శత్రువులతోనే కాదు..క్షణక్షణం గడిచిపోతున్న కాలంతో' అని ఆ భయానక ఘటన ఎలాంటిదో మాటల్లో చెప్పేసారు. 

కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాగ్‌‌‌‌‌‌‌‌ ఇన్సిడెంట్:

1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ విమానం ఐసీ814ను హైజాక్ చేసిన టెర్రరిస్టులు.. లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌‌‌‌‌‌‌‌లోని కాందహార్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వాళ్ల డిమాండ్స్‌‌‌‌‌‌‌‌ను ఒప్పుకున్న భారత ప్రభుత్వం జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌‌‌‌‌‌‌‌ మసూద్‌‌‌‌‌‌‌‌ అజహర్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో 36 మందిని విడుదల చేసింది. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వం వారిని ఎలా కాపాడింది అనేది ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో చూపించారు. నేడు ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ ను చూడటం మిస్ చేసుకోకండి.