ఎన్‌‌టీఏ వ్యవసాయ కోర్సుల్లో ఐకార్‌ పరీక్షకు నోటిఫికేషన్‌‌ రిలీజ్​

ఎన్‌‌టీఏ వ్యవసాయ కోర్సుల్లో ఐకార్‌ పరీక్షకు నోటిఫికేషన్‌‌ రిలీజ్​

నేషనల్‌‌ టెస్టింగ్‌‌ ఏజెన్సీ(ఎన్‌‌టీఏ) వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్‌‌ఎఫ్‌‌/ ఎస్‌‌ఆర్‌‌ఎఫ్‌‌, పీహెచ్‌‌డీ అడ్మిషన్స్​ కోసం నిర్వహించే ఇండియన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ అగ్రికల్చరల్‌‌ రీసెర్చ్‌‌(ఐకార్‌‌) ఆలిండియా ఎంట్రెన్స్‌‌ ఎగ్జామ్‌‌(ఏఐఈఈఏ) 2022-–23 నోటిఫికేషన్‌‌ను రిలీజ్​ చేసింది.

ఈ ఎంట్రెన్స్​ ఎగ్జామ్ తో  75 అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీలు ఇందులో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చరల్‌‌, ఫిషరీస్‌‌ యూనివర్సిటీలు, 4 ఐసీఏఆర్‌‌ డీమ్డ్‌‌ యూనివర్సిటీలు, 3 సెంట్రల్‌‌ అగ్రికల్చరల్‌‌ యూనివర్సిటీలు, 4 సెంట్రల్ యూనివర్సిటీల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్‌‌ఎఫ్‌‌, ఎస్‌‌ఆర్‌‌ఎఫ్‌‌ (పీహెచ్‌‌డీ) కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు. 

అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్‌‌ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. మిగిలిన కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 31 ఆగస్టు 2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు యూజీకి 16 ఏళ్లు, పీజీకి 19, పీహెచ్‌‌డీకి 20 ఏళ్లు నిండి ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష డ్యురేషన్​ 150 నిమిషాలు (యూజీ), 120 నిమిషాలు(పీజీ, పీహెచ్‌‌డీ) అభ్యర్థులకు ఉంటుంది.

అప్లికేషన్స్​:  బ్యాచిలర్‌‌ డిగ్రీ ప్రోగ్రాం అభ్యర్థులు రూ.800(ఓబీసీలు రూ.770, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌‌ జెండర్లు రూ.400 చెల్లించాలి). మాస్టర్ డిగ్రీ కోర్సు చేయాలనుకునే అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి. పీహెచ్‌‌డీ క్యాండిడేట్స్​రూ.1850 (ఓబీసీలు రూ.1820, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌‌ జెండర్లు రూ.920) అప్లికేషన్​ ఫీజు  చెల్లించాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  పూర్తి వివరాలకు www.icar.nta.nic.in వెబ్​సైట్​ సంప్రదించాలి.