
- 27న నెక్ట్స్ప్రీమియా మాల్ లో ‘ఐస్ క్రీమ్ టేస్టింగ్ చాలెంజ్’
హైదరాబాద్ సిటీ, వెలుగు: హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎర్రమంజిల్లోని నెక్ట్స్ప్రీమియా మాల్లో ‘ది గ్రేట్ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ చాలెంజ్’ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం సిటీలోని నెక్ట్స్ప్రీమియా మాల్ లో ఆవిష్కరించారు. సినీ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్ హాజరయ్యారు. ఐస్క్రీమ్టేస్టింగ్చాలెంజ్లో విజేతలకు నగదు బహుమతి ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విన్నర్కు రూ.లక్ష, రన్నర్కు రూ.50 వేలు, సెకండ్రన్నర్కు రూ.25 వేలు ఇస్తామన్నారు. అలాగే లక్కీ డ్రా ద్వారా 25 మందికి బహుమతులు ఇస్తామని చెప్పారు. 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలెంజ్కొనసాగుతుందని, ఎంట్రీ ఫీజును రూ. 250గా నిర్ణయించామన్నారు. ఇందులో రూ.100 విలువ చేసే ఐస్ క్రీమ్ ఓచర్ ఇస్తామన్నారు. కర్టన్రైజర్లో భాగంగా కావ్య కల్యాణ్రామ్, శ్వేతవర్మ, సమీర్టేస్టింగ్ చాలెంజ్లో పాల్గొన్నారు.