
హైదరాబాద్, వెలుగు: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్లో అడ్వాన్స్డ్ క్యూరేటెడ్ఎక్స్పీరియన్స్(ఏస్) అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడంలో పెట్టుబడిదారులకు ఇది సహాయపడుతుంది. దీంతో కస్టమర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా, వారి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా తగిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను పొందవచ్చు. ఈ ఫీచర్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఈజీగా మార్చడంతోపాటు, వినియోగదారులు సమర్థంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. 500 పైగా మ్యూచువల్ ఫండ్ల సమాచారం తెలుసుకోవచ్చు. వివిధ రకాల ఈక్విటీ, డెట్, టాక్స్-సేవింగ్, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్ల గురించి వివరాలు పొందవచ్చు.