న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2023–-24 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో రూ.751.3 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్లోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వచ్చిన లాభం రూ.556 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం పెరిగింది. తాజా క్వార్టర్లో ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.3,950.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.3,002.2 కోట్లతో పోలిస్తే ఎన్ఐఐ 31.6 శాతం పెరిగింది. గ్రాస్ఎన్పీఏల విలువ రూ.3,747.8 కోట్ల నుంచి రూ.3,603.4 కోట్లకు తగ్గింది.
ఏప్రిల్–-జూన్ కాలంలో గ్రాస్ జీఎన్పీ నిష్పత్తి రూ.2.17 శాతం నుంచి 2.11 శాతానికి మెరుగుపడింది. తాజా క్వార్టర్ ముగింపులో నికర ఎన్పీఏల విలువ రూ.1,192.5 కోట్లకు చేరింది. ఇది మునుపటి క్వార్టర్లో రూ.1,140 కోట్లుగా ఉంది. కోర్ ఆపరేటింగ్ లాభం సెప్టెంబర్ 2023 క్వార్టర్లో రూ.1,456 కోట్లకు చేరుకుంది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.1,052 కోట్ల నుంచి 38 శాతం పెరిగింది.
ప్రధాన నిర్వహణ ఆదాయం వార్షికంగా 35 శాతం పెరిగి రూ.5,326 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కస్టమర్ డిపాజిట్లు సంవత్సరానికి 44 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రెండవ క్వార్టర్లో కరెంట్ ఖాతా పొదుపు ఖాతా (కాసా) డిపాజిట్లు సంవత్సరానికి 26 శాతం పెరిగి రూ.79,468 కోట్లకు చేరుకున్నాయి. కాసా నిష్పత్తి 46.4 శాతంగా ఉంది. రిటైల్ డిపాజిట్లు సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి.