ఐడీఎఫ్సీ ఫస్ట్​ బ్యాంకుకు రూ.7,500 కోట్లు.. స్టాక్ ప్రైజ్ దూసుకెళ్తుందా..?

ఐడీఎఫ్సీ ఫస్ట్​ బ్యాంకుకు రూ.7,500 కోట్లు.. స్టాక్ ప్రైజ్ దూసుకెళ్తుందా..?

న్యూఢిల్లీ: వార్‌‌‌‌బర్గ్  పింకస్​, ఎడీఐఏ నుంచి ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా మొత్తం రూ. 7,500 కోట్ల నిధుల సేకరణను బోర్డు ఆమోదించినట్లు ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్   తెలిపింది. గురువారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు, గ్లోబల్ గ్రోత్ ఇన్వెస్టర్ వార్‌‌‌‌బర్గ్ పింకస్  అనుబంధ సంస్థ కర్రెంట్ సీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్​కు సుమారు రూ.4,876 కోట్ల విలువైన ఈక్విటీ క్యాపిటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూను ఆమోదించింది.  

అబుదాబి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అథారిటీ (ఏడీఏఐ)  పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ప్లాటినం ఇన్విక్టస్ బీ 2025 ఆర్​ఎస్​సీ లిమిటెడ్‌‌‌‌కు రూ.2,624 కోట్ల విలువైన ఈక్విటీ క్యాపిటల్‌‌‌‌ను జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. దీనిని ప్రైవేట్ ఈక్విటీస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ద్వారా నిర్వహిస్తారు.