రూ. 3,200 కోట్లను సమీకరించనున్న ఐడీఎఫ్​సీ ఫస్ట్​

రూ. 3,200 కోట్లను సమీకరించనున్న ఐడీఎఫ్​సీ ఫస్ట్​

 ముంబై :  ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్   ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయడం ద్వారా రూ. 3,200 కోట్ల నిధులను సమీకరించాలని  భావిస్తోంది. ఈ ప్రతిపాదిత మూలధన సమీకరణతో బ్యాంక్ మొత్తం మూలధన సమృద్ధి 17.49 శాతంకి పెరుగుతుంది. నిధుల సమీకరణ ప్రతిపాదనకు  బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ఇందుకోసం రూ.పది ముఖ విలువ కలిగిన 39,68,74,600 షేర్లను జారీ చేస్తారు.   షేర్ల జారీ,  కేటాయింపు కోసం బ్యాంక్  వాటాదారుల ఆమోదం కోసం పోస్టల్ బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తారు.