
గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ . శరణార్థులను విడుదల చేయకుంటే మీరు చచ్చినట్లేనని తీవ్రంగా హెచ్చరించారు. ‘‘శరణార్థుల విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది. ఇదే లాస్ట్ వార్నింగ్.’’ అంటూ తీవ్రంగా హెచ్చారించారు. శరణార్థులతో పాటు చనిపోయిన వారి మృతదేహాలను కూడా అప్పగించాలని అల్టిమేటమ్ జారీ చేశారు ట్రంప్.
‘‘గాజా ప్రజలకు మంచి ఫ్యూచర్ ఉంది. కానీ శరణార్థులను విడుదల చేయకుంటే మాత్రం మీరు చచ్చినట్లే. ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా విడుదల చేయండి.. లేదంటే మీకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైట్ హౌజ్ లో 8 మంది శరణార్థులు ట్రంప్ ను కలిసినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : యుద్ధమే కావాలంటే మేం సిద్ధం
ట్రంప్ తాజా స్టేట్ మెంట్ లో .. హమాస్ ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కు కావాల్సిన అన్ని రకాల సాయం, సామాగ్రిని పంపనున్నట్లు ప్రకటించారు. ఒక్క హమాస్ మెంబర్ కూడా మిగల కుండా ఫినిష్ చేయాలని అన్నారు.
హమాస్ విషయంలో ఎన్నో ఏళ్లుగా యూఎస్ దూరంగా ఉంటూ వస్తోంది. 1997 లో హమాస్ టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించిన నాటి నుంచి ఎలాంటి చర్చలు జరపలేదు. అయితే ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు హమాస్ విషయంలో యూఎస్ పాలసీ ఏంటో చెప్పకనే చెప్పినట్లు స్పష్టం అవుతోంది.
"'Shalom Hamas' means Hello and Goodbye - You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe
— President Donald J. Trump (@POTUS) March 5, 2025