
జీడిమెట్ల, వెలుగు: చదువు కోసం ట్యూషన్కు పంపిస్తే తన కొడుకును టీచర్దొంగగా మార్చాడని ఓ తండ్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపూర్నగర్ హెచ్ఎంటీ సోసైటీకి చెందిన కమల్జైన్బిజినెస్చేస్తున్నాడు. ఆయనకు ఏడో తరగతి చదువుతున్న కొడుకు (13) ఉండగా, చదువులో ముందుండడానికి షాపూర్నగర్లోని సందీప్అనే వ్యక్తి వద్దకు ట్యూషన్ పంపిస్తున్నాడు.
ఇటీవల కమల్ జైన్కు తన కొడుకు వద్ద ఐఫోన్16 కన్పించింది. ఫోన్ఎక్కడిదని ప్రశ్నించగా, తమ ట్యూషన్ టీచర్ఇచ్చాడని బాలుడు బదిలిచ్చాడు. డబ్బుల గురించి ఆరా తీయగా, తండ్రి షాపులోంచి అప్పడప్పుడు డబ్బులు తీసుకెళ్లి ట్యాషన్టీచర్కు దాదాపు రూ.2 లక్షల వరకూ ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సదరు టీచర్పై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు
జీడిమెట్ల పోలీసుల తీరుపై కమల్ జైన్పలు ఆరోపణలు చేశాడు. తన కొడుకుకు దొంగతనం నేర్పించిన ట్యూషన్టీచర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. కేసు నమోదు చేయకపోగా, ఓ ఎస్ఐ బూతులు తిట్టాడని ఆరోపించారు. కాంప్రమైస్కావాలని తనతోపాటు తన కొడుకును పీఎస్కు పిలిచి తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు.
దీంతో హుమన్రైట్స్కమిషన్ను సైతం ఆశ్రయించినట్లుపేర్కొన్నారు. ఈ విషయమై జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ని వివరణ కోరగా, ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే తాము కేసు నమోదు
చేసినట్లు తెలిపారు.