నవంబర్‌‌లో అంతర్జాతీయ సహకార సదస్సు

నవంబర్‌‌లో అంతర్జాతీయ సహకార సదస్సు

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ అలయన్స్, ఇఫ్కో చొరవతో ఐసీఏ జనరల్ అసెంబ్లీ  అంతర్జాతీయ సహకార సదస్సును మనదేశంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం 2024 నవంబర్ 25 నుంచి నవంబర్ 30 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో జరుగుతుందని ఐసీఐ డీజీ  జెరోయెన్ డగ్లస్ తెలియజేశారు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.   

‘సహకార సంఘాలు అందరి శ్రేయస్సును పెంపొందిస్తాయి’ అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమం సాగుతుంది. వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలను ప్రారంభించడం,  సహకారం రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా చర్చిస్తారు.  ఈ ఈవెంట్‌‌లో 100 దేశాలు పాల్గొనే అవకాశం ఉంది.