
- ఐజీ చంద్రశేఖర్రెడ్డి
కామారెడ్డిటౌన్, వెలుగు: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలకమని ఐజీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలతోపాటు కమాండ్ కంట్రోల్రూమ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా చాలావరకు నేరాలు తగ్గుతున్నాయన్నారు. దొంగతనాలు చేసే వాళ్లు కూడా భయపడుతారన్నారు.
ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా ఉంటున్నాయన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారిని ఆయన అభినందించారు. అనంతరం పోలీస్స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అంతకుముందు దేవునిపల్లి పీఎస్లో ఏర్పాటు చేసిన చిన్నారుల పార్క్ను ప్రారంభించారు. పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు. ఆయన వెంట ఎస్పీ సింధూశర్మ, ఏఎస్పీలు చైతన్యరెడ్డి, నరసింహారెడ్డి, సీఐలు చంద్రశేఖర్రెడ్డి, రామన్, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.