హైదరాబాద్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్ఫ్రాబిల్డ్ రెండో ఎడిషన్ సదస్సు శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. 2024 భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెలివరీని వేగవంతం చేయడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్కురంగంలో సవాళ్లు, పరిష్కారాలు, పురోగమనాలు, నిర్మాణ, మౌలిక సదుపాయాలపై ఈ సదస్సులో చర్చించారు. సదస్సుకు ఉక్కు మంత్రిత్వ శాఖ, వరల్డ్ స్టీల్ అసోసియేషన్ మద్దతు ఇచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ ఉక్కు కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ జిందాల్, సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాష్, జేఎస్డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జయంత్ ఆచార్యతోపాటు. ప్రముఖ బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్లు రైల్వేలు, మెట్రో నిర్మాణాలు, వంతెనలు, విమానాశ్రయాలను నిర్మించే టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.