
పంజగుట్ట, వెలుగు: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పంజాగుట్ట పోలీసులు రైడ్చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఓ బిల్డింగ్లో కొంత కాలంగా స్పా సెంటర్నడుస్తోంది. అయితే స్పా ముసుగులో లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సీసీఎస్పోలీసులకు సమాచారం అందింది. వారి సహకారంతో పంజాగుట్ట పోలీసులు రైడ్చేసి ఆరుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.