హైదరాబాద్ బేగంబజార్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరుశురాం టెంపుల్కు చెందిన 1300 గజాల భూమిని మురారి దాస్ ముందిడా అనే వ్యక్తి ఆక్రమించి భవనాలను నిర్మించాడు. ఈ క్రమంలో 1997 ఎండోమెంట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ప్రదేశంలో ఆక్రమణలు తొలగించి భూమినా స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ అధికారులకు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటినుంచి ఎండోమెంట్ అధికారులు కబ్జా దారులను ఖాళీ చేయాలని కోరుతున్నారు. అయినా ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో... హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 28, 2024న పోలీసుల సమక్షంలో భవనాలు కూల్చివేశారు. ఆక్రమణలు తొలగిస్తుండగా.. అధికారులకు.. కబ్జా దారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు ఆక్రమణ రాయుళ్లు దౌర్జన్యానికి దిగారు. కూల్చివేతలు ఆపాలని.. ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
ALSO READ | సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత