లింగంపేటలో ఆగని చెట్ల నరికివేతలు

లింగంపేటలో ఆగని చెట్ల నరికివేతలు

లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం బోనాల్​ శివారులోని అడవుల్లో  చెట్ల కూల్చివేతలు ఆగడం లేదు. అటవీభూముల కబ్జాల కోసం కొందరు  చెట్లను కోతమిషన్ల తో కూల్చివేస్తున్నారు. బోనాల్​గ్రామ సమీపంలోని నీలగిరి ప్లాంటేషన్​కు ఎదురుగా  ఉన్న అడవిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో లక్షల విలువజేసే టేకు చెట్లను ఇటీవల  కూల్చివేశారు.  

ఈ  విషయంపై ఈనెల16 న వెలుగు దినపత్రికలో ‘అడవికబ్జా’ శీర్షికన  కథనం ప్రచురితమైంది. అయినప్పటికీ   ఫారెస్టు ఆఫీసర్లు ఎలాంటి విచారణా  చేపట్టలేదు.   ఈ విషయంపై ఎఫ్డీఓ రామకృష్ణను వివరణ కోరగా..  చెట్ల నరికివేతలు జరుగుతున్నట్లు తమ  దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.