రాష్ట్రంలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

రాష్ట్రంలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ హెచ్చరించింది.సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది. 

హైదరాబాద్ లో శుక్రవారం(సెప్టెంబర్ 20) వరకు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులను పడనున్నాయి. దీంతో ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో సగటు వర్షపాతం 898.1 మిమీ నమోదైంది. సాధారణ వర్షపాతం 668.6 మిమీతో పోలిస్తే 34 శాతం పెరిగింది.