
తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. ఏప్రిల్ 7, 8 తేదీలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ( ఏప్రిల్ 8) సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలిపారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 5, 2025