గణేష్ నిమజ్జనం సందర్భంగా.. 2 రోజులు MMTS స్పెషల్ ట్రైన్లు

గణేష్ నిమజ్జనం సందర్భంగా.. 2 రోజులు MMTS స్పెషల్ ట్రైన్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఎంఎంటిఎస్ రైళ్లను ఆపరేట్ చేయనుంది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ లోకల్ ట్రైన్లు హైదరాబాద్ సిటీలో నడపనున్నారు. హైదరాబాద్ సిటీలో నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం ఎనిమిది ఎంఎంటీఎస్ ట్రైన్లు తిరగనున్నాయి. ఈ మేరకు గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆయా రూట్ల వివరాలు ప్రకటించారు.

ఈ రూట్లలో 8 MMTS ట్రైన్లు :

  • హైదరాబాద్ - లింగంపల్లి

  • సికింద్రాబాద్- హైదరాబాద్

  • లింగంపల్లి - ఫలక్ నామా

  • హైదరాబాద్-లింగంపల్లి

  • లింగంపల్లి -హైదరాబాద్

  • ఫలక్ నామా - సికింద్రాబాద్

  • హైదరాబాద్ - సికింద్రాబాద్ అందుబాటులో ఉండనున్నాయి.