
వెలుగు, ముషీరాబాద్ : బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్లో శుక్రవారం నిర్వహించిన ‘ఫుడ్కార్నివాల్’ ఆకట్టుకుంది. ఇంటర్ ప్రీమియర్ షిఫ్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బిజినెస్ ఐడియాలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 600 మంది స్టూడెంట్లు కలిసి 40కి పైగా ఫుడ్స్టాల్స్ఏర్పాటు చేశారు.
ముఖ్యఅతిథిగా మాజీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొని ప్రారంభించారు. ట్రెండ్కు తగ్గట్టుగా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ చారి, కాలేజీ డైరెక్టర్ వై.విష్ణుప్రియ, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.