పూణెలో మరో హిట్ అండ్ రన్ కేసు:తాగి ఆడి కారుతో డ్యాష్..వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు

పూణెలో మరో హిట్ అండ్ రన్ కేసు:తాగి ఆడి కారుతో డ్యాష్..వ్యక్తి  స్పాట్లోనే చనిపోయాడు

ముంబైలోని పూణెలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. శుక్రవారం అర్థరాత్రి కోరెగావ్ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ బాయ్ ని ఆడి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం (అక్టోబర్ 10) తెల్లవారుజామున ఒంటి గంట పప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు రౌఫ్ షేక్ గా గుర్తించారు. నిందితుడిని 34 యేళ్ల ఆయుష్ తాయల్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ మొదట బైక్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై వెళ్తు్న్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తర్వాత బాధితుడు రౌఫ్ షేక్ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో రౌఫ్ స్పాట్ లోనే చనిపోయాడు. 

హిట్ అండ్ రన్ కు కారణమైన నిందితుడు ఆయుష్ తాయల్ ను సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అనంతరం హడప్సర్ ప్రాంతంలో తాయల్ ను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అతనిపై పలు కేసు నమోదు చేశారు. 

పూణెలో మత్తులో ర్యాష్ డ్రైవింగ్ ఇది మొదటిది కాదు. 2024 ప్రారంభంలో మే 19న పూణెలోని కళ్యాణి నగర్ లో 17 మైనర్ పోర్స్చే కారు నడిపి ఐటీ సాఫ్ట్ వేర్లు అనీష్ అవధియా, అశ్వినీ కోష్టలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు.