బీసీలకు విద్య, ఉద్యోగ, రాజ‌కీయాల్లో పెద్దపీట‌ :  కంది శ్రీనివాసరెడ్డి

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజ‌కీయాల్లో పెద్దపీట‌ :  కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగం, రాజ‌కీయాల్లో అవకాశాలకు  42 శాతం రిజర్వేషన్​ కల్పించి పెద్దపీట‌ వేసిందని ఆదిలాబాద్​ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.  మంగళవారం ప్రజాసేవా భవన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు కల్పించేందుకు  ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్  ప‌థ‌కం ప్రారంభించిందని పేర్కొన్నారు.   బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చినా సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.  డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, నాయకులు పవన్, మునిగేల నర్సింగ్  తదితరులు పాల్గొన్నారు.