
పారిస్ : ఒలింపిక్స్లో 52 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన ఉత్సాహంలో ఉన్న ఇండియా హాకీ టీమ్ అదే జోరుతో సెమీఫైనల్ బెర్తుపై కన్నేసింది. ఆసీస్పై గెలుపు జోరును కొనసాగిస్తూ ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ పని పని పట్టాలని టార్గెట్గా పెట్టుకుంది.
గత పోరులో హర్మన్ప్రీత్ సేన పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. సెమీస్లో వరల్డ్ నం. 2 బ్రిటన్పైనా ఇదే విధంగామెప్పించాల్సిన అవసరం ఉంది. టోర్నీలో ఆరు గోల్స్ కొట్టిన కెప్టెన్ హర్మన్ప్రీత్ మరోసారి కీలకం కానున్నాడు.