అర్హులందరికీ 'డబుల్ బెడ్ రూమ్ 'ఇళ్లు ఇవ్వాలి

అర్హులందరికీ 'డబుల్ బెడ్ రూమ్  'ఇళ్లు ఇవ్వాలి

రంగారెడ్డి కలెక్టర్ శశాంక 

షాద్ నగర్,వెలుగు: షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ శశాంక తెలిపారు. నియోజకవర్గంలోని కొత్తూరు, షాద్ నగర్ మున్సిపాలిటీల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి   పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ వెంకట మాధవరావు, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మౌలిక వసతులు వెంటనే కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ చీమ వెంకన్న, తహసీల్దార్​ పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి వెంకటరామిరెడ్డి, కొంకల్ల చెన్నయ్య,   రఘు, చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం
 తదితరులున్నారు.