ఐటీ వెబ్​సైట్​ రీలాంచ్‌​.. కొత్త ఫీచర్లు, యూజర్​ ఫ్రెండ్లీనెస్​

ఐటీ వెబ్​సైట్​ రీలాంచ్‌​.. కొత్త ఫీచర్లు, యూజర్​ ఫ్రెండ్లీనెస్​

న్యూఢిల్లీ: ఇన్‌కమ్‌ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​తమ వెబ్​సైట్​ను మరింత యూజర్​ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు, వాల్యూయాడెడ్​ ఫీచర్లు, కొత్త మాడ్యూల్స్ తో రీలాంచ్‌ ​ చేసింది . ఈ కొత్త వెబ్​సైట్​ను సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​డైరెక్ట్​ టాక్సెస్​ (సీబీడీటీ) చైర్మన్​ నితిన్​ గుప్తా  ఉదయ్​పూర్​లో జరిగిన చింతన్​ శిబిర్​లో ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు మంచి ఎక్స్​పీరియన్స్​ ఇవ్వడంతో పాటు, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలనే ఆలోచనతోనే వెబ్​సైట్​రీలాంచ్‌​ చేసినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. మొబైల్​ నుంచి  చూసేందుకు కూడా కొత్త వెబ్​సైట్​ అనువుగా ఉంటుందని పేర్కొంది. 

కంటెంట్​ కోసం  మెగా మెను ఉంటుందని, కొత్త ఫీచర్లు, ఫంక్షనాలిటీస్​ చేర్చామని వివరించింది. వెబ్​సైట్​ విజిటర్లకు ఈ కొత్త మార్పులన్నీ వివరించేందుకు ఒక వర్చువల్​ గైడెడ్​ టూర్ ​అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కంటెంట్​ను వెతుక్కునేందుకు వీలుగా ఉంచినట్లు వెల్లడించింది.