టెక్స్​టైల్​కు నిధుల పెంపు .. నిరుటితో పోలిస్తే 28 శాతం అదనం

టెక్స్​టైల్​కు నిధుల పెంపు .. నిరుటితో పోలిస్తే 28 శాతం అదనం
  •  ఈ సెక్టార్​కు 4,417.3 కోట్లు
  • కాటన్​ ప్రొక్యూర్​మెంట్​కు రూ.600 కోట్లు
  • టెక్నాలజీ అప్​గ్రేడేషన్​ ఫండ్​ స్కీమ్​కు రూ. 635 కోట్లు

న్యూఢిల్లీ: టెక్స్​టైల్​ రంగానికి కేంద్ర సర్కారు ఈ సారి ప్రాధాన్యతనిచ్చింది. ఈ రంగానికి 28% బడ్జెట్​ను పెంచింది. 2024–25 బడ్జెట్​లో టెక్స్​టైల్​ రంగానికి రూ.4,417.03 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.4,373 కోట్లు రెవెన్యూ, రూ.43.65 కోట్లు క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కోసం ప్రతిపాదించింది. కాటన్​కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి సేకరణకు ఇందులో రూ.600 కోట్లు కేటాయించింది.

పత్తి ధరలు.. కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కాటన్​ ప్రొక్యూర్​మెంట్​కు నిధులు కేటాయించలేదు. ప్రస్తుతం ధరలు ఎంస్​పీ కంటే తక్కువగా ఉండడంతో కేంద్రం నిధులు ఇచ్చింది. అలాగే, సవరించిన టెక్నాలజీ అప్​గ్రేడేషన్​ ఫండ్​ స్కీమ్​ (ఏడీయూఎఫ్​ఎస్​)కు రూ. 635 కోట్లు కేటాయించింది. నిరుడు ఈ స్కీమ్​కు రూ. 675 కోట్లు ఇచ్చింది. ఇక నేషనల్​ టెక్నికల్​ టెక్స్​టైల్స్​ మిషన్​(ఎన్​టీటీఎం) కోసం రూ. 375 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 170 కోట్లు ప్రతిపాదించిన కేంద్ర సర్కారు.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని డబుల్​ చేసింది. 

పీఎల్ఐ స్కీమ్​కు రూ.45 కోట్లు

రీసెర్చ్​అండ్​ కెపాసిటీ బిల్డింగ్​​కింద టెక్స్​టైల్​ కోసం ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ స్కీమ్​ (పీఎల్​ఐ) కు రూ. 45 కోట్లను కేంద్ర సర్కారు కేటాయించింది. అలాగే, స్కిల్​డెవలప్​మెంట్​ఇంటిగ్రేటెడ్​ స్కీమ్​ కోసం రూ. 166 కోట్లు, టెక్స్​టైల్​ క్లస్టర్​ డెవలప్​మెంట్​ స్కీం కోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించింది. రీసెర్చ్​అండ్​ కెపాసిటీ బిల్డింగ్​కోసం బడ్జెట్​ను రూ. 380.50 కోట్ల నుంచి రూ. 686 కోట్లకు పెంచింది.

కాగా, ఈ బడ్జెట్​లో రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​కు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాగే, కొత్త టెక్స్​టైల్స్ పార్కుల ఏర్పాటుకు ఉద్దేశించిన పీఎం మిత్ర కోసం ​రూ. 300 కోట్లు కేటాయించారు. రా మెటీరియల్​ సప్లై స్కీమ్​కోసం రూ. 172 కోట్లు, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఫ్యాషన్​ టెక్నాలజీ (నిఫ్ట్​)కు 98.67 కోట్ల కేటాయింపులు చేశారు. నిరుడితో పోలిస్తే నిఫ్ట్​కు ఈసారి బడ్జెట్​ తగ్గించారు.