IND vs SL: కొలొంబో చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

IND vs SL: కొలొంబో చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ప్రస్తుతం భారత జట్టు.. శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ ఇరు జట్ల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో వన్డే జట్టులో సభ్యులైన పలువురు భారత ఆటగాళ్లు ఆదివారం రాత్రి శ్రీలంక చేరుకున్నారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా కొలొంబో చేరుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండైన అనంతరం వీరు ఐటీసీ రత్నదీప హోటల్‌లో బస చేశారు. సోమవారం సాయంత్రం ఈ ఆరుగురు నెట్ సెషన్‌లో పాల్గొననున్నారు. జూలై 30న పల్లెకెలెలో జరిగే మూడవ టీ20 అనంతరం ఇతర జట్టు సభ్యులు వీరితో కలవనున్నారు.

టీ20 సిరీస్ వశం 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే సిరీస్ వశమవ్వగా.. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. సూర్య సారథ్యంలోని భారత యువ జట్టు అన్నీ విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఆతిథ్య జట్టుకు ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వడం లేదు. 

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. 

వన్డే సిరీస్ షెడ్యూల్:

  • మొదటి వన్డే: ఆగస్టు 2 (శుక్రవారం) 
  • రెండో వన్డే: ఆగస్టు 4 (ఆదివారం)
  • మూడో వన్డే: ఆగస్టు 7 (బుధవారం)

వన్డే సిరీస్ మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం, 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.