IND vs ZIM: జింబాబ్వేతో మూడో టీ20.. టీమిండియా బ్యాటింగ్

 IND vs ZIM: జింబాబ్వేతో మూడో టీ20.. టీమిండియా బ్యాటింగ్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు(బుధవారం, జులై 10) భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసి విజయం సాధించడంతో అదే నిర్ణయాన్ని పునరావృతం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు సభ్యులైన యశస్వి జైస్వాల్, వికెట్‌కీపర్‌ సంజు శాంసన్, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె తిరిగి ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చారు.  

   మరోవైపు, జింబాబ్వే తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఓపెనర్‌ ఇన్నోసెంట్ కైయాకు గాయం కావడంతో అతని స్థానంలో మారుమణిని తీసుకున్నారు. ఇక పేసర్ జాంగ్వి స్థానంలో రిచర్డ్ నగరవకు అవకాశమిచ్చారు. 

తుది జట్లు 

భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే: మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.