ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం-2025 పురస్కరించుకుని భారతదేశం నుంచి మరో నాలుగు చిత్తడి నేలలను రామ్సర్ జాబితాలోకి చేర్చడంతో వీటి సంఖ్య 89కి చేరింది. తమిళనాడు రాష్ట్రంలోని సక్కరకోట్టై పక్షుల అభయారణ్యం, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, సిక్కింలోని ఖేచెయోపల్రి చిత్తడి నేలలు, జార్ఖండ్లోని ఉద్వా సరస్సు కొత్తగా రామ్సర్ జాబితాలో చేరాయి.
నక్కరకోట్టై పక్షుల అభయారణ్యం
ఈ అభయారణ్యాన్ని 2012, ఏప్రిల్ 17న స్థాపించారు. 230.490 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వేప, పామిరా పామ్, గ్లోరియోసా సూపర్బా అనే వృక్షజాలం ఉన్నది. సింహం తోక గల మకాక్, జెయింట్ స్క్విరెల్ , వలస పక్షులు.
తీర్థంగల్ పక్షుల అభయారణ్యం
ఈ అభయారణ్యాన్ని 2010, డిసెంబర్ 15న స్థాపించారు. ఇది 29.29 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. అసోనోజెటన్ నూటాన్స్, హైడ్రిల్లా వెర్టిసిల్లాటా, టామరిండస్ ఇండికా వంటి విభిన్న వృక్ష జాతులకు నిలయంగా ఉన్నది.
ఖేచెయోపల్రి చిత్తడి నేల
ఈ చిత్తడి నేలను కోరికలు తీర్చే సరస్సుగా నమ్ముతారు. బౌద్ధులు, హిందువులుగా పవిత్రమైంది. స్థానికంగా దీనిని షో డిజో షో అని పిలుస్తారు.
ఉద్వా సరస్సు
పటౌరా జీల్(155 హెక్టార్లు), బ్రహ్మ జమాల్ పూర్ జీల్(410 హెక్టార్లు) రెండు అతి పెద్ద నీటి వనరులు ఈ సరస్సులో భాగంగా ఉన్నాయి. 1991లో పక్షుల అభయారణ్యంగా గుర్తించారు. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి వలస పక్షులకు నిలయంగా ఉంటుంది. ఈ సరస్సు గంగా నదికి సమీపంలో ఉంది.
దేశంలో గుర్తించిన తొలి రామ్సర్ సైట్లు:
- చిల్కా సరస్సు(ఒడిశా), కియోలాడియా జాతీయ పార్క్(రాజస్తాన్)
- అత్యధిక రామ్సర్సైట్లు కలిగిన రాష్ట్రాలు: తమిళనాడు(20), ఉత్తరప్రదేశ్(10)
- దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్: సుందర్బన్ మడ అడవులు(పశ్చిమబెంగాల్)
- దేశంలో అతిచిన్న రామ్సర్ సైట్: రేణుక వెట్ల్యాండ్ (హిమాచల్ప్రదేశ్)