బదోనీ ధనాధన్..ఇండియా-ఎ హ్యాట్రిక్​ విక్టరీ

బదోనీ ధనాధన్..ఇండియా-ఎ హ్యాట్రిక్​ విక్టరీ

అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్ టీ20 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ జట్టు హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయాలు సాధించింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బదోనీ (51), తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ (36), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (34) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ 6 వికెట్ల తేడాతో ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 140/5 స్కోరు చేసింది.

మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నదీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హమద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీర్జా (28 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వాసిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ (24), జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17) ఫర్వాలేదనిపించారు. అకీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రసిఖ్ సలామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమణ్​దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. తర్వాత ఇండియా 15.2 ఓవర్లలో 146/4 స్కోరు చేసి నెగ్గింది. అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8), నేహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాధెరా (1) ఫెయిలైనా, అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బదోనీ ఈజీగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిపించారు. బదోనీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా
తలపడుతుంది.