
- ఐరాస వేదికగా పాకిస్తాన్కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (యూ ఎన్హెచ్ఆర్సీ) వేదికగా పాకిస్తాన్కు భారత్మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ఇచ్చింది. జెనీవాలో గురువారం జరిగిన యూ ఎన్హెచ్ఆర్సీ 58వ సెషన్ ఏడో సమావేశంలో పాకిస్తాన్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.
దీంతో.. తరార్ వ్యాఖ్యలపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి తీవ్ర అభ్యంతరం చెప్పారు. "జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజంతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని తేవడానికి నిబద్ధతతో పనిచేస్తున్నాం. కొన్నేండ్లుగా జమ్మూ కాశ్మీర్లో అపూర్వమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతి సాధిస్తున్నాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనం.
ఈ క్రమంలో పాకిస్తాన్ మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు" అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సొంత దేశంలోని సంక్షోభాలను పరిష్కరించుకోవడంలో విఫలమైనప్పటికీ.. భారత్పై తన వ్యతిరేకతను బయటపెట్టేందుకు మాత్రం అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందన్నారు.
మైనారిటీలను హింసించడం, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడం వంటి ట్రాక్ రికార్డ్ను కలిగిన పాకిస్తాన్ కు.. మానవ హక్కులపై మాట్లాడే విశ్వసనీయత లేదన్నారు.