రూ.6,498 కోట్లు అందాయి.. యూఎస్ ఎయిడ్ నిధులపై భారత్ క్లారిటీ

రూ.6,498 కోట్లు అందాయి.. యూఎస్ ఎయిడ్ నిధులపై భారత్ క్లారిటీ

న్యూఢిల్లీ: భారత్‎కు అమెరికా నుంచి వస్తున్న యూఎస్ ​ఎయిడ్ ​నిధులపై ఆ దేశ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్​ చేపట్టిన దాదాపు రూ.6,498 కోట్ల 93 లక్షల 7 వేల 500 (750 మిలియన్ డాలర్స్​) విలువైన ఏడు ప్రాజెక్టులకు యూఎస్​ఎయిడ్​ నిధులు అందినట్టు రిపోర్ట్‎లో తెలిపింది. ఈ ప్రాజెక్టులను అమెరికా భాగస్వామ్యంతో భారత్​ చేపట్టిందని పేర్కొంది. ఇందులో అమెరికా రూ.825 కోట్లు (97 మిలియన్​ డాలర్లు) కేటాయించినట్టు వెల్లడించింది. ఈ ఏడాది పోలింగ్​శాతాన్ని పెంచేందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలిపింది.