
- వీసా ఉల్లంఘనలకు పాల్పడటంతో వెనక్కి
న్యూఢిల్లీ: భారత్15 మంది విదేశీయులను బహిష్కరించింది. చెల్లుబాటు అయ్యే వీసాలు లేకుండా ఇండియాలో ఉంటుండంతో వారిని వెనక్కి పంపింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు, 12 మంది నైజీరియన్లు, ఐవరీ కోస్టుకు చెందిన ఒకరు ఉన్నారు. ఢిల్లీ పోలీసులు సిటీలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు మోహన్ గార్డెన్, ఉత్తమ్నగర్ ఏరియాలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
ఇందులో భాగంగా దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న 15 మందిని గుర్తించి డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత నిర్వహించిన వెరిఫికేషన్లో వారు భారత్ లో అక్రమంగా ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని తిరిగి స్వస్థలాలకు పంపాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ వో) ఆదేశాలు జారీచేసింది. దీంతో15 మందిని తిప్పి పంపింది.