దేశంలో 8 శాతం తగ్గిన వంటనూనెల దిగుమతులు

దేశంలో 8 శాతం తగ్గిన వంటనూనెల దిగుమతులు

న్యూఢిల్లీ:  మనదేశ వంట నూనెల దిగుమతి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఏడాది లెక్కన 8 శాతం తగ్గి 8,85,561 టన్నులకు చేరుకుందని సాల్వెంట్​ఎక్స్​ట్రాక్టర్స్​అసోసియేషన్​ఆఫ్​ఇండియా (ఎస్​ఈఏ) వెల్లడించింది. ఫిబ్రవరిలో వంట నూనె, ఇతర నూనెల దిగుమతులు 7 శాతం తగ్గి 8,99,565 టన్నులకు చేరుకున్నాయి. గత ఫిబ్రవరిలో 9,65,852 టన్నుల నూనె దిగుమతి అయింది. ఇందులో 8,85,561 టన్నుల వంటనూనెలు,  14,004 టన్నుల ఇతర నూనెలు ఉన్నాయి. 

కరోనా కారణంగా 2020 మేలో దిగుమతులు 7,20,976 టన్నులకు పడిపోయాయి. ఆ తరువాత ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారని ఎస్​ఈఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024–-25 చమురు మార్కెటింగ్ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం వంటనూనె దిగుమతులు 48,07,798 టన్నులకు చేరుకున్నాయి.