అక్టోబర్ 10 ఇందిర ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడుని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి..సకల కష్టాలు తొలిగిపోతాయని పురాణాల కథనం. ఈ ఇందిర ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది.
శ్రీమహావిష్ణువు రూపమైన శాలిగ్రామాన్ని ఇందిరా ఏకాదశి నాడు పూజిస్తారని పండితులు చెబుతున్నారు ఈసారి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని 2023 అక్టోబర్ 10వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ద్వారా భక్తులు విష్ణువు అపారమైన అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. మనిషి జనన మరణ బంధాల నుండి కూడా విముక్తి పొందుతారు. ఈ వ్రతమున శ్రీ హరిని ఆచారాల ప్రకారం పూజించాలి.
ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడట. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడని స్కంద పురాణంలో తెలిపారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని విధిగా పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయని ధర్మారాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి.
ఇందిర ఏకాదశి విశిష్టత గురించి.
వ్రత విధానం గురించి ఇంద్రుడికి నారదుడు చెప్పాడు. ఏకాదశి రోజున( అక్టోబర్ 10) తెల్లవారు ఝామునే మేల్కొని స్నానం చేసి.. ఉపవాసం ఉండాలి. ఓ పద్మనేత్రుడా... నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను” అని పలికి భగవంతుని స్తుతించాలని పూజారులుచెబుతున్నారు. తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి.
- ALSO READ | 2023 : ఇందిర ఏకాదశి రోజు అక్టోబర్ 10.. ఈ 5 కార్యాలు చేస్తే.. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి
శ్రీ కృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో, స్మరణముతో ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం కుటుంబ సభ్యులు , బంధు మిత్రులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారాయణం చేస్తూ భోజనం చేయాలి. ఇలా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే పితృలు నిశ్చయంగా విష్ణులోకానికి వెళతారని నారద మహర్షి ఇంద్రుడికి చెప్పాడు.
నారదుడు .. ఇంద్రసేనుడికి ఏం చెప్పాడంటే
తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూధుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.