ప్రాక్టీస్ షురూ చేసిన యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా

ప్రాక్టీస్ షురూ చేసిన యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా

హరారే:  శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం జింబాబ్వే చేరుకుంది.  నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌‌‌‌‌‌‌‌ వీవీఎస్ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు బుధవారం హరారేలో అడుగు పెట్టింది. ఇండియా ప్లేయర్లు తమ లగేజీతో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి బయటికి వెళ్తున్న  ఫొటోలను జింబాబ్వే క్రికెట్ తమ ఎక్స్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. మొత్తం జట్టు ముంబై నుంచి మంగళవారం బయల్దేరగా.. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఆడిన జట్టులో రిజ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటగాడిగా ఉన్న  శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌  న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ నుంచి హరారే చేరుకున్నాడు. 

హరారేలో ల్యాండ్ అవ్వడమే ఆలస్యం గిల్ కెప్టెన్సీలోని ఆటగాళ్లు  ప్రాక్టీస్ సెషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అందరికంటే ముందుగా నెట్స్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ గిల్ పుల్‌‌‌‌‌‌‌‌షాట్లు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కనిపించాడు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా ఈ నెల 6న హరారే క్రికెట్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆడనుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు కూడా అదే వేదికపై జరుగుతాయి.