
బ్యాంకాక్: బంగాళాఖాతంలో అత్యంత పొడవైన సముద్ర తీరరేఖ భారత్ సొంతమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్అన్నారు. గురువారం బ్యాంకాక్లో బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) దేశాల మంత్రుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇండియాకు బంగాళాఖాతంలో 6,500 కి.మీ. పొడవైన తీరరేఖ ఉంది. ఐదు బిమ్స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దులను పంచుకోవడమే కాకుండా, వాటిలో చాలా దేశాలను కనెక్ట్చేస్తుందన్నారు.
బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలకు కామన్ ఇంట్రెస్టులు, కామన్ టెన్షన్లు ఉన్నాయి, ఇవన్ని మన చరిత్ర నుంచి పుట్టుకొచ్చాయి”అని అన్నారు.