ఇండియా కూటమి కాదు.. కరప్షన్ కూటమి : పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఇండియా కూటమి కాదు.. కరప్షన్ కూటమి :   పొంగులేటి సుధాకర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని..అది కరప్షన్ కూటమని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మోదీని, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదురుగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మోదీ వేవ్ ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి స్పందన దక్కిందని.. ఆరు, ఏడవ విడతల్లో నార్త్ లోనూ ప్రజలు మోదీకే పట్టం కట్టబోతున్నారని చెప్పారు. ఢిల్లీ, వారణాసీలో ఉన్న సౌత్ ఓటర్లను కలుస్తున్నట్లు చెప్పారు. తెలుగు, తమిళ, కర్నాటక సంఘాలతో ప్రచారం చేస్తున్నామని..బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.