
గత ఐదేళ్లలో 2019 నుంచి 2023 వరకు భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు చేసింది. గత ఐదేళ్లలో భారతదేశ ఆయుధాల కొనుగోళ్లు 4.7 శాతం పెరిగాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్వీడన్ (ఎస్ఐపీఆర్ఐ) నివేదిక వెల్లడించింది.
- భారతదేశానికి ప్రధాన ఆయుధ సరఫరాదారులుగా తొలి మూడు దేశాలు రష్యా (36 శాతం), ఫ్రాన్స్ (33 శాతం), అమెరికా (13 శాతం) ఆయుధాలను విక్రయించారు. పాకిస్తాన్కు చైనా గరిష్టంగా 66 శాతం ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆయుధాల దిగుమతిని 43 శాతం పెంచింది.
- 2019–23 మధ్యలో ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. అయితే, చైనా ఆయుధ దిగుమతుల్లో 44 శాతం క్షీణత నమోదైంది. చైనా రెండు తూర్పు ఆసియా పొరుగు దేశాలైన జపాన్; దక్షిణకొరియా ఆయుధాల కొనుగోళ్లపై తమ వ్యయాన్ని పెంచాయి. జపాన్లో 155 శాతం, దక్షిణకొరియాలో 6.5 శాతం పెరుగుదల కనిపించింది.
- భారత్కు రష్యా అత్యధికంగా 36 శాతం ఆయుధాలను సరఫరా చేస్తున్నా ఆయుధాల ఎగుమతుల్లో రష్యా మూడో స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2014–18, 2019–23లో యూరప్ ఆయుధాల దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీని వెనుక రెండేళ్లుగా సాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు సైనిక సహాయంగా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి.