నాలుగో జలాంతర్గామిని ఆవిష్కరించిన ఇండియన్ నేవీ

నాలుగో జలాంతర్గామిని ఆవిష్కరించిన ఇండియన్ నేవీ

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు విశాఖ సముద్ర తీరంలో అణు సామర్థ్యంతో కూడిన  బాలిస్టిక్​ క్షిపణి వ్యవస్థ కలిగిన నాలుగో జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్​)ను నేవీ ఆవిష్కరించింది. ఈ జలాంతర్గామికి ఎస్–​4 అని పేరు పెట్టారు. ఇందులో 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె–4 అణు బాలిస్టిక్​ క్షిపణులను అమర్చారు. మొదటి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్​ అరిహంత్​ కేవలం 750 కి.మీ. పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు.  ఇండియన్ నేవీలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్​ చక్రను రష్యా నుంచి లీజుకు తీసుకున్నారు.

15 ఏండ్ల క్రితం 2011, డిసెంబర్​లో భారత్​ సొంతంగా న్యూక్లియర్​ సబ్​ మెరైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిని తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖలోని నేవీ షిప్​ బిల్డింగ్​సెంటర్లో నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తొలి ఎస్​ఎస్​బీఎన్​ (షిప్​, సబ్​మెర్సిబుల్​, బాలిస్టిక్​, న్యూక్లియర్​) జలాంతర్గామి.. ఐఎన్ఎస్​అరిహంత్ 2018 నుంచి నేవీకి పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నది. ఆ డిజైన్​, స్ఫూర్తితో దానికి మించిన శక్తితో ఐఎన్​ఎస్ అరిహంత్​ను 2024, ఆగస్టులో రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ నౌకాదళానికి అందజేశారు.